తాడేపల్లి: భారత ఏస్ ఆర్చర్ జ్యోతి సురేఖను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జ్యోతి సురేఖ, తండ్రి వెన్నం సురేంద్ర కుమార్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ను కలిశారు. ఇటీవల బెర్లిన్ లో జరిగిన వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్, ప్యారిస్లో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్లో పలు పతకాలు సాధించిన జ్యోతి సురేఖను సీఎం వైయస్ జగన్ అభినందించారు. ఛాంపియన్ షిప్, వరల్డ్ కప్లో తాను సాధించిన పతకాలను సురేఖ సీఎం వైయస్ జగన్కు చూపించారు. అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను వెలుగెత్తిచాటడంపై సురేఖను సీఎం వైయస్ జగన్ ప్రశంసించారు. తనకు డిప్యూటీ కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి జ్యోతి సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని, రాబోయే రోజుల్లో ఇదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సీఎం వైయస్ జగన్ సూచించారు.