మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై సూచ‌న‌లు ఇవ్వండి

 

ప్ర‌తిప‌క్షాన్ని కోరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అసెంబ్లీ: మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై ప్ర‌తిప‌క్షం ఏమైనా సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వాల‌ని స‌భాధ్య‌క్షులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కోరారు. ఉల్లిపై చ‌ర్య‌కు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని సీఎం చెప్పారు. అసెంబ్లీలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. చ‌ట్ట‌స‌భ‌లోనే ఒక యాక్టు తీసుకురావాల‌నే ఆలోచ‌న‌తో శాస‌న‌స‌భ్యుల సూచ‌న‌లు, స‌ల‌హాలు తీసుకునే కార్య‌క్ర‌మం చేస్తున్నాం. ఇందులో భాగంగా గౌర‌వ ప్ర‌తిప‌క్ష‌నేత‌ను కూడా మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై మీద సూచ‌న‌లు ఇవ్వాల‌నుకుంటే ఇవ్వండి అని సీఎం కోరారు. ఉల్లి గురించి ఇంత‌కు ముందే వివ‌రంగా చెప్పానని, ఆ త‌రువాత చ‌ర్చ‌కు కూడా అభ్యంత‌రం లేద‌న్నారు. మ‌హిళ‌ల భ‌ద్ర‌త మీద చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ అంశంపై సూచ‌న‌లు ఇవ్వాల‌ని కోరారు.  

Read Also: ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన బియ్యం పంపిణీ చేస్తాం

Back to Top