నరసన్నపేట చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్

శ్రీ‌కాకుళం:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్దిసేప‌టి క్రిత‌మే న‌ర‌స‌న్న‌పేటకు చేరుకున్నారు.  విశాఖ ఎయిర్‌ పోర్ట్ వ‌ద్ద ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూముల రీ సర్వేను ఎన్నో ఆటంకాలు, వ్యయ ప్రయాసలను అధిగమించి తొలిదశలో 2 వేల గ్రామాల్లో పూర్తి చేసింది. ఆధునిక డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించనున్నారు. 

Back to Top