ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి భేటీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురువారం ఉదయం 10.30 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో విభజన హామీలు, పెండింగ్ బకాయిల సహా తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.