రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఈ గొప్ప విజయం ప్రజలది
15 Mar 2021 11:29 AM
మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయంపై సీఎం వైయస్ జగన్ ట్వీట్
తాడేపల్లి: పురపాలక ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ అఖండ విజయం సాధించడంపై సీఎం వైయస్ జగన్ స్పందించారు. ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గొప్ప విజయం ప్రజలదని వినమ్రంగా పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ‘‘ఈ గొప్ప విజయం ప్రజలది. దేవుని దయతో ప్రతి అక్కచెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వాతాత మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం వల్ల ఈ చారిత్రక విజయం సాధ్యమైంది.
ఈ విజయం నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని, బాధ్యతను పెంచింది. ఇంకా మంచి చేయడానికి మీ కుటుంబంలో ఒకరిగా మరింత తాపత్రయపడతాను’’ అని పేర్కొన్నారు. విజయం సాధించిన ప్రతి సోదరుడికి, అక్కచెల్లెమ్మకూ అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం పేర్కొన్నారు.