కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
చంద్రబాబూ.. ఇక రాజకీయాల నుంచి వైదొలుగు..!
09 Jun 2019 8:22 PM
వైయస్ జగన్ దేశంలోనే మోడల్ సీఎం
వైయస్ఆర్సీపీ నేత దాడి వీరభద్రరావు
విశాఖపట్నం : గత ఏడాది కాలంగా చంద్రబాబు పాలన గాలికి వదిలేసారని వైయస్ఆర్సీపీ నేత దాడి వీరభద్రరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఆదివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గజ దొంగల పాలన పోయిందని.. టీడీపీ ఓటమి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్లు కారణంగా గుర్తించాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇక రాజకీయాల్లో నుంచి వైదొలగడం మంచిదని చెప్పారు. ప్రజలు అత్యంత హీనంగా టీడీపీని తిప్పి కొట్టారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే ఓ మోడల్ సీఎం అని పేర్కొన్నారు. దేశంలోని ఇతర పార్టీలు వైఎస్ జగన్ పాలన వైపు చూస్తున్నాయని తెలిపారు.