అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
కే ట్యాక్స్పై విచారణ జరపాలి
13 Jun 2019 11:38 AM
కోడెలా ఎప్పడైనా ప్రోటోకాల్ పాటించారా..?
స్పీకర్ హోదాలో పార్టీ సమావేశం నిర్వహించడం వాస్తవం కాదా..?
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
అమరావతి:నరసరావుపేట నియోజకవర్గంలో కోడెల ఎప్పడైనా ప్రోటోకాల్ పాటించారా అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ గతంలో సత్తెనపల్లిలో గెలిచి నరసరావుపేటలో కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎప్పుడైనా నరసరావుపేటలో గెలిచిన ఎమ్మెల్యేను పిలిచారా అని ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమాల్లో ఏ స్పీకర్ అయినా పాల్గొంటారా.? కోడెల స్పీకర్ హోదాలో ఉండి కార్యకర్తల సమావేశం నిర్వహించడం వాస్తవం కాదా..పార్టీ కండువాలు కప్పలేదా..అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. స్పీకర్గా ఉండి వైయస్ జగన్ను తిట్టిన సందర్భాలు గుర్తుకులేదా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ట్విట్ చేసిన తర్వాతేనే కే ట్యాక్స్ మీద కేసులు ప్రారంభం అయ్యాయని కోడెల చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.అదేవిధంగా స్పీకర్ పదవికి ఏవిధమైన కళంకం తేలేదనే కోడెల వ్యాఖ్యలను ఖండించారు. కోడెల కుటుంబం చేసిన అరాచకాలు వెలుగు చూస్తున్నాయన్నారు. టీడీపీ కార్యకర్తలే కోడెలపై కేసులు పెడుతున్నారని తెలిపారు.నరసరావుపేటలో విచ్చలవిడి దోపిడీ జరిగిందన్నారు. నరసరావుపేటలో 8 కేసులు నమోదయ్యాయన్నారు.ఇంకా వందల మంది ఎదురుచూస్తున్నారన్నారు.కే ట్యాక్పై సిట్ లేదా సిబిసిఐడి విచారణ జరగాలన్నారు.