ఇసుక దోపిడీతో కోట్లు కొల్ల‌గొట్టిన టీడీపీ నేత‌లు

మంత్రి బొత్స సత్యనారాయణ 

విజ‌య‌న‌గ‌రం: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ఇసుక దోపిడీతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గౌరీపురం వద్ద కృష్ణమహంతిపురం పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన పెట్రోల్‌ బంకును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  నామినేటెడ్‌ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50శాతం పదవులు ఇస్తూ జీఓ తెచ్చామని, ఆ పదవుల్లో నియమించిన వారిని తొలగించే వీలులేకుండా చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు.  
 

Read Also: రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తాం

Back to Top