తాడేపల్లి: సీపీఎస్ రద్దుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం సజ్జల రామకృష్ణారెడ్డిని ఏపీ ఉద్యోగుల జేఏసీ నేతలు కలిశారు. పెండింగ్ జీతాలను చెల్లించడం పట్ల ఉద్యోగుల జేఏసీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే పెన్షనర్లకు డీఏ బకాయిలు చెల్లింపు జీవోలను ఇస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.