మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
ముగిసిన కేబినెట్ భేటీ
19 Aug 2020 1:55 PM
పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలపై మంత్రివర్గ సభ్యులు సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపారు. నవరత్నాల్లో మరో హామీ అమలుకు సీఎం వైయస్ జగన్ నిర్ణయించారు. వైయస్ఆర్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆసరా పథకం ద్వారా నాలుగేళ్లలో 27 వేల కోట్లకుపైగా డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా సెప్టెంబర్ 1న వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం, సెప్టెంబర్ 5న వైయస్ఆర్ విద్యాకానుక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా నూతన పారిశ్రామిక విధానానికి, పంచాయతీ రాజ్ శాఖలో 51 డివిజనల్ డెవలప్మెంట్ అధికారుల పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 11న వైయస్ఆర్ ఆసరా పథకం ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.