బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
రివర్స్ టెండరింగ్తో అవినీతి బయటకు వస్తుందని బాబుకు భయం
22 Aug 2019 6:46 PM
మంత్రి అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు : రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతి బయటకు వస్తాయని చంద్రబాబకు భయం పట్టుకుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆపేస్తున్నట్లు టీడీపీ హడావుడి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. పోలవరం జల విద్యుత్ కేంద్రం టెండర్ రద్దుపై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించడంపై ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. యధావిథిగా రివర్స్ టెండిరింగ్కు వెళ్లవచ్చనిఏది ఏమైనా కోర్టు తీర్పును గౌరవిస్తామని...ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక వరదల్లో ఒక్క తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. వరదలను కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని, వరదల్లో ఒక్క గండి పడలేదని, ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నామని అనిల్ కుమార్ పేర్కొన్నారు.
వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి
వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వర్షాలు సంవృద్ధిగా కురిసి జలాశయాలు అన్ని నిండుతున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అలిపిరి కాలిబాట ద్వారా తిరుమల చేరుకున్న ఆయన వెంకన్నను దర్శనం చేసుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, టీటీడీ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించారు. మంత్రిగా బాధ్యలు స్వీకరించిన తర్వాత తొలిసారి తిరుమలకు వచ్చినట్లు అనిల్కుమార్ తెలిపారు.