అమరావతి: సర్వీసు కాలంలో ఎప్పుడైనా 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ను మహిళా ఉద్యోగులు వాడుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ను నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎం వి రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిలు కలిశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎమ్మెల్సీలు టి కల్పలత, ఎం వి రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సీఎంకు విజ్ఞాపన పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ను... పిల్లలు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మాత్రమే వాడుకోవాలన్న నిబంధనను తొలగించాలని సీఎంకు విన్నవించిన ఎమ్మెల్సీలు. ఎమ్మెల్సీల విజ్ఞప్తిపై స్పందిస్తూ.. ఈ నిబంధనను మార్పు చేస్తూ... సర్వీసు కాలంలో ఎప్పుడైనా 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ను మహిళా ఉద్యోగులు వాడుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం. ప్రైవేటు స్కూళ్ల రెన్యువల్ ఆఫ్ రికగ్నైజేషన్ను మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలకు పెంచాలని సీఎంకు విజ్ఞప్తి. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు ఆదేశం