వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ముస్లింలకు అల్లాహ్ దీవెనలు లభించాలి
07 May 2019 9:54 AM
వైయస్ జగన్ రంజాన్ నెల శుభాకాంక్షలు
హైదరాబాద్: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు నియమనిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య మాసాన్ని ముస్లిం సోదర సోదరీమణులంతా జరుపుకొం టారని, వారికి అల్లాహ్ దీవెనలు లభించాలని ఆయన ఆకాంక్షిం చారు. మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది రంజాన్ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. రంజాన్ అంటే ఉపవాస దీక్షలు మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప సందర్భం అని ఆయన అన్నారు.