ముస్లింల‌కు అల్లాహ్‌ దీవెనలు లభించాలి

 వైయ‌స్‌ జగన్‌ రంజాన్‌ నెల శుభాకాంక్షలు
 

 హైదరాబాద్‌: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ మాసం ప్రారంభమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్  పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు నియమనిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య మాసాన్ని ముస్లిం సోదర సోదరీమణులంతా జరుపుకొం టారని, వారికి అల్లాహ్‌ దీవెనలు లభించాలని ఆయన ఆకాంక్షిం చారు. మహనీయుడైన మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించింది రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. రంజాన్‌ అంటే ఉపవాస దీక్షలు మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప సందర్భం అని ఆయన అన్నారు.

 

Back to Top