ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
వైయస్ జగన్ 30 నెలల పాలన..సంక్షేమ సంతకం
01 Dec 2021 3:32 PM
కోవిడ్ సంక్షోభంలో రాష్ట్ర ఆదాయం తగ్గినా హామీలన్నీ అమలు
వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 30 నెలల పాలన పూర్తి చేసుకున్న
ప్రజలకు మంచి చేసేందుకు అనుభవం కంటే చిత్తశుద్ధే కార్యసిద్ధిగా పాలన
అన్ని వర్గాలకు అండగా నిలిచిన వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
సీఎం వైయస్ జగన్ 30 నెలల పాలనపై అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ప్రత్యేక కథనం
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి 30 నెలల పాలన రాష్ట్ర ప్రజలకు సంతృప్తినిచ్చింది. అనుభవం లేదని ఆరోపణలు చేసిన పచ్చ ముఠాకు ఈ 30 నెలల పాలన చూసి తనకు రాజకీయ భవిష్యత్ లేదని ముచ్చెమటలు పట్టేలా చేసింది. నవంబర్ 30 నాటికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 నెలలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రత్యక కథనాన్ని రూపొందించారు. ఈ కథనం ద్వారా 30 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలకు వేల కోట్లు జరిగిన లబ్ధి, లబ్ధి పొందిన లక్షలాది కుటుంబాల వివరాలు తెలిపారు.
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 30 నెలల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు..
30 నెలల పాలనలో 14 నెలలు కోవిడ్ పాండమిక్ సంక్షోభం ఎదుర్కొంటున్న పరిస్థితులలో ప్రపంచంలో సంపన్న దేశాలైన అమెరికా, జపాన్ లాంటి దేశాలు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. దేశంలో సంపన్న రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో కూడా అనేక కార్యక్రమాలు హామీలు ఇచ్చిన అక్కడ ప్రభుత్వాలు అమలు చేయలేకపోయాయి. శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు ప్రమాణం శ్రీకారం చేసి నవంబరు,30 నాటికి 30 నెలలు పూర్తి అవుతున్నది. ఈ 30 నెలల్లో 14 నెలలు కోవిడ్ పాండమిక్ సంక్షోభం మూలంగా రాష్ట్ర అదాయం గణనీయంగా తగ్గింది. అయినప్పటి రైతులకు, పేద వర్గాలకు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ ప్రకటించిన తేదీలకు విడుదల చేయడం చాలా గొప్ప విషయం. శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అనుభవం లేదని పచ్చ ముఠా మాట్లాడినారు. ప్రజలకు మంచి చేయటానికి అనుభవము కంటే కూడా చిత్తసుద్ధి ఉంటే కార్యసిద్ధి జరుగుతుంది అనే దానికి ఉదాహారణ శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు.
ఈ 30 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలకు వేల కోట్లు జరిగిన లబ్ది, లబ్ది పొందిన లక్షలాది కుటుంబ వివరాలు ఇస్తున్నాము. దయచేసి ప్రతి వారు పరిశీలించవలిసినదిగా కోరుతున్నాము. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా జూన్, 2019 నుండి నవంబరు 30, 2021 వరకు ఆంధ్రప్రదేశ్లో జగనన్న ప్రభుత్వం పాలనలో ప్రవేశపెట్టిన వివిధ పథకాల ద్వారా లబ్దిపొందిన కుటుంబాల సంఖ్య, వివరములు మరియు ఖర్చు చేసిన మొత్తం
· డాక్టర్ వై.యస్.ఆర్. రైతు భరోసా ప్రతి ఏడాది రూ.12,500/– నాలుగు సం॥రాలకు హామీ ఇచ్చి, దానిని ఏడాదికి రూ.13,500/– కు, పెంచి ఐదు సం॥రాలు అమలు చేయడము జరుగుతుంది. ఇప్పటి వరకు రూ.18,777 కోట్లు రైతులకు చెల్లించడము జరిగింది.
· అదనంగా వ్యవసాయానికి 9 గం. పగలు ఉచిత విద్యుత్ 18.7 లక్షల కనెక్షన్లుకు అందించడానికి 8,353 కోట్లు వ్యయం మరియు విద్యుత్ సబ్సే్టషన్ల ఆధునీకరణకు 1700 కోట్లు .
· గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ డిస్కమ్లకు 20 వేల కోట్లు బకాయి ఇందులో 8,750 కోట్లు ఉచిత విద్యుత్ బకాయి. 7 గం. లు ఉచిత విద్యుత్ సరఫరాకు 8,750 కోట్లు బకాయి అంటే 15 నెలల వాడకానికి డబ్బు చెల్లించలేదు. అంటీ 5 సంవత్సరాలకు 3 సం. 9 నెలలు మాత్రమే ఆ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇచ్చింది.