హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమాలు, మోసాల మీద రైతు భరోసా యాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన చేసిన పవర్ ఫుల్ కామెంట్స్ లో టాప్ టెన్ వ్యాఖ్యలు చూద్దాం. 1. బాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతులు, అక్కచెల్లెల్లు, చేనేతలు, చదువుకునే చిన్నపిల్లలను కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడు. 2. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇటువంటి బాబు చేసిందేమైనా ఉందంటే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటమే.3. సిగ్గులేదా బాబు నీకు. అవినీతి రహిత రాష్ట్రం గురించి మాట్లాడతావా. చదువుకునే పిల్లలతో ప్రమాణం చేయిస్తావా.4. ఇసుక నుంచి బొగ్గు దాకా అవినీతే. రాజధాని భూముల నుంచి గుడి భూములు అమ్మేదాకా అవినీతే.5. గుడిలో, గుడిలో లింగాన్ని కూడా మింగుతున్నాడు. 17 మందిని 30 కోట్ల చొప్పున అంటే 600కోట్లకు కొన్నాడు .6. అయినా సరే, చంద్రబాబు అక్రమాల్ని ఎవరూ ప్రశ్నించకూడదట. బాబు మోసం చేసినా ఎవరూ అడగడకూడదట. 7. వెన్నుపోటు పొడిచినా ఎవరూ అడగకూడదా. 8. ఇన్ని మోసాలు చేస్తున్న చంద్రబాబు ని చెప్పుతో కొట్టడంలో తప్పేం ఉంది.9. బంగాళాఖాతంలో కలిసే రోజు దగ్గర్లోనే ఉంది. బాబులో మార్పు రావాలంటే మనమంతా ఒక్కటై ఒత్తిడి తేవాలి. 10. ఈపోరాటం ఇంతటితో ఆగదు. కొనసాగించే కార్యక్రమంలో మీ దీవెనలు కావాలి.