వైఎస్ జగన్ టాప్ టెన్ పవర్ ఫుల్ కామెంట్లు



ప్రతిపక్ష నేత
వైఎస్ జగన్ చింతపల్లి బహిరంగ సభలో గిరిజనుల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని
నిలదీశారు. బాక్సైట్ తవ్వకాల కోసం చంద్రబాబు కుట్రల్ని ఆయన ఎండగట్టారు. ఆయన
ప్రసంగంలోని టాప్ టెన్ కామెంట్స్:

  1. గ్రామసభ జరిగి ఉంటే పుస్తకాల్లో ఉండాలి.. అవి
    కూడా ఏమీ లేవని ప్రస్తుత సర్పంచి చెప్పారు. గ్రామాలు ఏవీ అంగీకరించకపోయినా
    చంద్రబాబు అబద్ధాలు చెబుతూ ముందుకెళ్లిపోతున్నారు. శ్వేతపత్రంలో ఇవే అబద్దాలు
    పలికించి చూపించారు.
  2. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఎందుకు వేయడం లేదని
    చంద్రబాబును గట్టిగా నిలదీస్తున్నా. కారణం ఏమిటంటే రాష్ట్రంలో మొత్తం 7 గిరిజన స్థానాలుంటే ఆరింటిలో వైఎస్ఆర్‌సీపీ
    సభ్యులున్నారు. కమిటీ వేస్తే, అందులో
    అంతా వైఎస్ఆర్‌సీపీ సభ్యులే ఉంటారు కాబట్టి, బాక్సైట్‌కు
    అనుకూలంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోలేరు కాబట్టి గిరిజన సలహా కమిటీ
    నియామకాన్ని కూడా వాయిదా వేస్తున్నారు
  3. మీరు చేసేదేమీ ఎక్కువ రోజులు సాగదు. ఒత్తిడి
    తెచ్చి, గిరిజన సలహా కమిటీ
    వేయించి, అందులో గట్టిగా
    వ్యతిరేకిస్తాం
  4. గిరిజనులతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని
    కేంద్రం చెప్పడంతో మనం బతికిపోయాం
  5. చంద్రబాబు సీఎం అయ్యాక ఒకటి కాదు, రెండు కాదు.. 10.2.2015న ఒకటి, 23.2.2015, 21.7.2015, 5.8.2015న ఇంకోటి.. ఇలా
    వరుసపెట్టి లేఖలు కేంద్రానికి రాసి, ఒత్తిడి
    తెస్తేనే బాక్సైట్ తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
  6. ప్రభుత్వం జీవో ఇస్తే చేస్తుంది, ఉపసంహరించుకుంటే చేయదు. మధ్యలో పెండింగులో
    పెట్టడం ఏ ముఖ్యమంత్రి దగ్గరా వినలేదు.
  7. చంద్రబాబు జీవితం అంతా మోసం.. మోసం.. మోసం..
    అన్న మూడు పదాల చుట్టే తిరుగుతుంది.
  8. బాక్సైట్ తవ్వకాలకు ఆయన అనుమతి ఇచ్చినా ఒక్క
    అంగుళం కూడా ముందుకు కదలదు
  9. నువ్వు(చంద్రబాబు)  నిజంగా మంచోడివైతే, మాటమీద నిలబడే తత్వం ఉంటే వెంటనే జీవోను రద్దు
    చేసి, మాట నిలబెట్టుకోండి.
  10. అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం, అండగా ఉంటాం. అన్ని రకాలుగా మనం గట్టిగా పోరాడుదాం.




Back to Top