ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
రాక్షస పాలన
16 Mar 2019 11:48 AM
మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యలో పెద్ద కుట్రే
పోలింగ్కు సరిగా 26 రోజుల ముందు హత్య
కర్నూలు : దివంగత నేత వైయస్ రాజ శేఖర్రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్యలో పెద్ద కుట్రే ఉన్నట్టు స్పష్టమవుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ప్రత్యర్థుల వ్యూహంలో భాగంగానే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. హత్య ఎవరు చేశారో పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిర్ధారించాల్సిన ప్రభుత్వ పెద్దలు రాజకీయాలు మాట్లాడడంపై ప్రజలు మండిపడుతున్నారు.
కేసు పక్కదోవ పట్టించే విధంగా టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేయడాన్ని తప్పు పడుతున్నారు. రాష్ట్రంలో రాక్షసపాలన నడుస్తోందని, ఈ హత్యోదంతమే నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా..వైయస్ వివేకానందరెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటే బోలెడు కారణాలు కనిపిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు.. అదీ పోలింగ్కు సరిగా 26 రోజుల ముందు వివేకానందరెడ్డిని హత్య చేయడం వల్ల ఓ బలమైన సంకేతం ఇవ్వాలన్న తాపత్రయం కనిపిస్తోంది.
పులివెందులలోనే వివేకాను హత్య చేస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా చేయవచ్చన్న వ్యూహం కనిపిస్తోంది. వైయస్ఆర్ , కర్నూలు జిల్లాలో వైయస్ వివేకానందరెడ్డికి పరిచయాలున్నాయి. వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెండు జిల్లాల రాజకీయాల్లో వివేకానందరెడ్డి క్రియాశీలకంగా ఉండేవారు. అజాత శుత్రువైన వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసును నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.