చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పొరపాటున బాబుకు ఓటేస్తే..ఏమీ మిగలవు
29 Mar 2019 6:31 PM
నగరి సభలో వైయస్ జగన్
చంద్రబాబు పాలనలో కొత్త పరిశ్రమలు రావు..ఉన్న పరిశ్రమలు మూత
సహకార రంగాన్ని నిర్వీర్యం చేశారు
దళారులకు చంద్రబాబే నాయకుడు
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో కనిపించేది మోసం మోసం మోసం
ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుందని ఎవరూ మర్చిపోవద్దు.
చిత్తూరు: మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మీ భూములు, ఇళ్లు ఏవీ మిగవని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడే భూసేకరణ చట్టానికి సవరణలు చేశాడు. కేంద్రంలో చట్టం తీసుకువస్తే దానికి సవరణలు చేశాడన్నారు. వెబ్ ల్యాండ్ పేరిట మీ భూముల రికార్డులు తారుమారు చేస్తున్నాడని మండిపడ్డారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మీ భూములు ఉండవు. మీ ఇళ్లులు ఉండవని మర్చిపోవద్దని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..వైయస్ జగన్ మాటల్లోనే..
3648 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. నా పాదయాత్ర నగరి నియోజకవర్గం గుండా సాగింది. నా పాదయాత్ర పూర్తి చేయగలిగాను అంటే దేవుడి దయ, మీ అందరి దీవెనలతో మాత్రమే చేయగలిగాను. ఆ రోజు మీరన్న ప్రతి మాట, పాదయాత్రలో మీరు చెప్పిన ప్రతి బాధ, ప్రతి కష్టం ఇవాల్టికి నాకు బాగా గుర్తుంది. రేణుగుంట చక్కెర ఫ్యాక్టరీ గురించి ఇదే.. ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉన్నా.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత కొత్త పరిశ్రమలు రావడం దేవుడికెరుగు, చక్కెర ఫ్యాక్టరీ మూతపడిందన్నా అని మీరు చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఫ్యాక్టరీ మూతపడడంతో 360 మందికి ఉద్యోగాలు ఊడడమే కాకుండా, జీతాలు ఎగరగొట్టమే కాకుండా విధిలేని పరిస్థితుల్లో రైతులు మయూరి, ఇంద్ర వంటి ఫ్యాక్టరీలకు చెరుకును బలవంతంగా అమ్ముకోవాల్సి వస్తుందన్నా.. కోఆపరేటివ్గా ఉన్న చిత్తూరు, రేణుగుంట ఫ్యాక్టరీలను చంద్రబాబు దగ్గరుండి మూసేయించారు. దాని వల్ల రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి కోఆపరేటివ్ చక్కెర ఫ్యాక్టరీలు ఉంటేనే కదా అన్న వచ్చేది అని ఆ రోజు రైతులు చెప్పిన బాధలు ఇవాల్టికి గుర్తున్నాయి.
ఇదే జిల్లాలో మామిడి రైతులు ఎక్కువే. మన ఖర్మ ఏంటంటే.. ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు మామిడి రైతులను పిప్పిపీల్చిచేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఇదే జిల్లాలోనే గల్లా ఫ్రూట్స్, శ్రీని ఫ్రూట్స్, ఒకటి ఎంపీకి, మరొకటి ఎమ్మెల్యేకు సంబంధించిన ఫ్యాక్టరీలు. వీరంతా పంట చేతికి వచ్చే సరికి కుమ్మకై దళారీలను ప్రోత్సహిస్తున్నారు. మామిడి రైతుల పంట చేతికి వచ్చే సరికి తోతాపురి మామిడి చిత్తూరు జిల్లాకే కాదు.. దేశానికే ఫేమస్. పరిస్థితి ఏమిటంటే.. కనీసం రూ. 16 వేలు వస్తేకానీ గిట్టుబాటు కాదు.. అలాంటిది గల్లా ఫ్రూట్స్, శ్రీని ఫ్రూట్స్ వీరంతా ఒక్కటై దళారీ వ్యవస్థను తీసుకొచ్చి పంట చేతికి వచ్చే సరికి రూ. 5 వేలు కూడా రాని పరిస్థితిలోకి రైతులను నెట్టేశారు. ఆ రైతులు చెప్పిన సమస్యలు ఇవాల్టికి గుర్తున్నాయి.
చిత్తూరు జిల్లాలో నా దగ్గరకు రైతులు వచ్చి అన్నా ఒక లీటర్ పాల ధర, ఒక లీటర్ కిన్లీ మినరల్ వాటర్ ధర రూ. 23, పాల ధర కూడా అదే రూ. 23 పలుకుతుందని ఆ రైతులు ఆవేదనతో చెప్పిన మాటలు ఇవాల్టికి గుర్తున్నాయి. చిత్తూరు డెయిరీ నడిస్తే హెరిటేజ్ డెయిరీకి లాభాలు రావని, తన సొంత కంపెనీకి లాభాలు రావడం కోసం చిత్తూరు డెయిరీని మూత వేసిన వ్యక్తి ఈ జిల్లా ముఖ్యమంత్రి కావడం సిగ్గుగా ఉంది.
గాలేరు – నగరి ప్రాజెక్టు అక్షరాల 25 వేల 800 వందల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని వేణుగోపాల్సాగర్ పనులు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే దాదాపు 80 శాతం పూర్తి చేశారు. అటువంటి ప్రాజెక్టు ఇవాళ చంద్రబాబు హయాంలో జరిగిందేమిటంటే.. అంచనాలు పెంచి తన బినామీ అయిన సీఎం రమేష్ అనే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆవేదనతో చెప్పిన మాటలు ఇవాల్టికి గుర్తున్నాయి.
ఇదే జిల్లాలో పవర్ లూమ్స్పై ఆధారపడి దాదాపుగా 10 వేల మంది కార్మికులు బతుకుతున్నారు. నగరంలో టెక్స్టైల్ పార్కు పెడితే అంతో ఇంతో వారికి మేలు జరుగుతుంది. వాళ్ల దుస్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగు అవుతాయని తెలిసినా.. చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేయలేదు. నాన్నగారి హయాంలో ఆఫ్లీయన్ ట్రీట్మెంట్ ప్లాంట్ను తీసుకువచ్చి అప్పట్లోనే పూర్తి చేస్తే.. చంద్రబాబు పూర్తయిపోయిన ప్రాజెక్టును ఓపెన్ చేయడానికి కూడా మనస్సురాని పరిస్థితి. ఆ ప్రాజెక్టు ఓపెన్ చేస్తే వైయస్ఆర్కు క్రెడిట్ వస్తుందని దిక్కుమాలిన ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆ రోజు నా దగ్గరకు వచ్చి ప్రజలు చెప్పిన బాధలు.
మీ ఎమ్మెల్యే నా సోదరి రోజమ్మ ఒక మహిళా ఎమ్మెల్యేను ఎవరైనా ప్రోత్సహిస్తారు. ఆడవాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా ప్రోత్సహిస్తారు. కానీ, మహిళల తరుఫున మాట్లాడుతూ గట్టిగా నిలబడిందని మహిళ అని చూడకుండా చంద్రబాబు సస్పెండ్ చేశాడంటే ఇంతటి దారుణం ఇంకేదైనా ఉంటుందా.. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో నగరి నియోజకవర్గం తీసుకున్నా.. ఆంధ్రరాష్ట్రంలో ఏ నియోజకవర్గం తీసుకున్నా.. మీ అందరికీ కనిపించేది మోసం.. మోసం.. మోసం అన్న పదాలే చంద్రబాబు పాలనలో కనిపిస్తాయి. ప్రతి విషయంలో అబద్ధాలు, ప్రతి విషయంలో మోసాలు. ఇంకా అవినీతిని చూశాం. దుర్మార్గాన్ని గ్రామస్థాయికి తీసుకురావడం చూశాం.
చంద్రబాబుకు పొరపాటున 2014లో ఓటేసిన తరువాత ఈ ఐదేళ్లు అన్ని రకాలుగా మోసపోయాం. మళ్లీ 14 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మళ్లీ చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే ఉన్న గవర్నమెంట్ స్కూళ్లు చంద్రబాబు మూసేయిస్తాడు. ఇప్పటికే ఐదేళ్ల కాలంలో అక్షరాల 6 వేల ప్రభుత్వ బడులను మూసివేయించాడు. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పేదవారు ఎవరూ కూడా తమ పిల్లలను బడులకు పంపించే పరిస్థితి ఉండదు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పేదవాడు తమ పిల్లలను బడులకు పంపించే పరిస్థితి ఉండదు. గ్రామాల్లో ఇప్పటికే నారాయణ స్కూళ్లు కనిపిస్తున్నాయి. ఆ స్కూళ్లలో ఎల్కేజీ చదవాలంటే రూ. 25 వేలు.. పిల్లలు చదవాలంటే ఇక మీదట లక్ష రూపాయలు లాగుతారని మర్చిపోవద్దు.
ఇప్పటికే మన పిల్లలు ఇంజనీరింగ్ చదవలేని పరిస్థితి. కాలేజీల్లో ఫీజులు సంవత్సరానికి రూ. లక్ష దాటుతున్నాయి. ఈ సారి చంద్రబాబుకు పొరబాటున ఓటు వేస్తే ఈసారి రూ. 5 లక్షలు దాటుతుందని మర్చిపోవద్దు. పొరపాటున మళ్లీ చంద్రబాబుకు ఓటు వేస్తే ఈ ఐదేళ్లలో మనం చూశాం కరెంటు, ఆర్టీసీ చార్జీలు బాదుడే.. బాదుడు. ఐదు సంవత్సరాల్లో ఇంటి పన్నులు బాదుడే.. బాదుడు. చివరకు నీటి కుళాయి పన్ను బాదుడే.. బాదుడు. పెట్రోల్, డీజిల్ రేట్లు బాదుడే.. బాదుడు. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక మీదట వీర బాదుడు ఉంటుందని మర్చిపోవద్దు.
పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే అధికారంలోకి రాగానే పెన్షన్లు తీసేస్తాడు, రేషన్ కార్డులు కూడా కోసేస్తాడు. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోవాలని కోరుతున్నా.. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు మన రాష్ట్రంలో పెన్షన్ కార్డులు అక్షరాల 44 లక్షలు ఉండేవి. ఈయన ముఖ్యమంత్రి అయిన తరువాత 36 లక్షలకు తగ్గించేశాడు. రేషన్ కార్డుల పరిస్థితి మీ అందరికీ తెలిసిందే.. మళ్లీ ఎన్నికలు వచ్చాయని మూడు నెలల కోసం రేషన్కార్డులు, పెన్షన్ కార్డులు పెంచాడు. ఇవేవీ మర్చిపోవద్దు.
మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మీ భూములు, ఇళ్లు ఏవీ మిగల్చడు. ఇప్పుడే భూసేకరణ చట్టానికి సవరణలు చేశాడు. కేంద్రంలో చట్టం తీసుకువస్తే దానికి సవరణలు చేశాడు. వెబ్ ల్యాండ్ పేరిట మీ భూముల రికార్డులు తారుమారు చేస్తున్నాడు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మీ భూములు ఉండవు. మీ ఇళ్లులు ఉండవని మర్చిపోవద్దు.
ఇప్పటికే మన ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, మన నదులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికే ఇసుకను వదలడం లేదు. మట్టిని, కొండలు, గుట్టలు, పొలాలు, నదులు కూడా వదిలిపెట్టడం లేదు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఇక అంతో ఇంతో మిగిలి ఉన్న ఇసుక, మట్టి, గుట్టలు, కొండలు, నదులు ఏవీ మిగలవు. ఇప్పటికి ఇసుక లారీ రూ. 40 వేలు పలుకుతుంది. పొరపాటున ఓటేస్తే లక్ష రూపాయలకు పాకుతుందని మర్చిపోవద్దు.
ఇప్పటికే గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో జన్మభూమి కమిటీల మాఫియాను తయారు చేశాడు. పెన్షన్, రేషన్, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా, గవర్నమెంట్కు సంబంధించిన ఏ సంక్షేమ పథకం అయినా మీ చేతికి రావాలంటే వారు అడుగుతున్న ప్రశ్న ఏమిటీ..? మీరు ఏ పార్టీ వారని జన్మభూమి కమిటీ అడుగుతుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఈసారి మీరు ఏ సినిమా చూడాలో.. మీ ఏ టీవీ చానళ్లు, ఏ పత్రికలు చదవాల్లో ఇదే జన్మభూమి కమిటీలు నిర్ణయిస్తాన్న సంగతి మర్చిపోవద్దు. వాళ్ల సినిమానే చూడాలి. ఇప్పటికే మీరంతా చూస్తున్నారు. మహానాయకుడు అంట అది మాత్రమే చూడాలంట. ఆయనకు వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే.. ఎన్టీఆర్ జీవిత చరిత్ర తీస్తే దాన్ని చూడకూడదని, కోర్టుకు వెళ్లి ఆపించేశాడు. ఇప్పటికే పరిస్థితి ఇది. ఒక పొరపాటున ఓటు వేస్తే తరువాత వాళ్ల సినిమాలే చూడాలి. వాళ్ల టీవీలు, వాళ్ల పత్రికలే చదవాలి. వాళ్ల ఆస్పత్రికి, వాళ్ల స్కూళ్లకు వెళ్లి ఎంత చెబితే అంత కట్టిపోవాల్సిన పరిస్థితి. వస్తుంది.
పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే రైతులకు ఇక ఉచిత విద్యుత్ ఉండదని మర్చిపోవద్దు. ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న ఆరోగ్యశ్రీ, 108, 104 ఇక ఏవీ కనపడవని గుర్తుపెట్టుకోండి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న ఫీజురియంబర్స్మెంట్ ఉండదు. పక్కా ఇళ్ల పథకాలు ఉండవని, అన్నీ కూడా రద్దు అయిపోతాయని మర్చిపోవద్దు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్త ఇళ్లు ఇచ్చే కార్యక్రమాలు కూడా ఉండవు.
ఒక్కసారి ఇదే పెద్దమనిషి చంద్రబాబు గత చరిత్రను గుర్తు చేసుకోండి. 1994 ఎన్నికలను గుర్తు చేసుకోండి. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటలు, వాగ్ధానాలు సంపూర్ణ మద్య నిషేదం, రూ. 2కే కిలోబియ్యం అని ఎన్నికల్లో గెలిచింది. ఎన్నికలు అయిపోయిన తరువాత 1995లో ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు గద్దెనెక్కాడు.. రూ. 2కే కిలోబియ్యం మొదట మూడున్నర రూపాయలకు పోయింది. ఆ తరువాత ఐదు రూపాయల 20 పైసలకు పోయింది. మద్యపాన నిషేదం పూర్తిగా ఎత్తేశారని మర్చిపోవద్దు. 50 గవర్నమెంట్ కంపెనీలు పూర్తిగా అమ్మేసిన పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈ సారి పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఇప్పటికే సున్నావడ్డీ తీసేశాడు.. చంద్రబాబుకు మళ్లీ ఓటేస్తే వడ్డీలు బాదుడే.. బాదుడు.
చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే రైతులకు బ్యాంకుల నుంచి వచ్చే రుణాలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరు చెప్పి రుణాలన్నీ పూర్తిగా కటింగ్ పెడతాడని మర్చిపోవద్దు. ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబు నాయుడు చేస్తున్న వాగ్దానాలు, చూపిస్తున్న సినిమాలు, చెబుతున్న కొత్త పథకాలు ఒక్కసారి గమనించండి. ఎన్నికలు అయిపోయిన తరువాత ఇవన్నీ పూర్తిగా రద్దు అయిపోయితాయి.
చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే. తనను వ్యతిరేకించే వారిని ఎవర్ని బతకనివ్వడు. తన పోలీసులనే గ్రామం నుంచి రాజధాని వరకు పెట్టుకున్నాడు. మనుషులను చంపినా కేసులు ఉండవు. సీబీఐని రానివ్వడు. సీబీఐని రానివ్వడు. ఈడీని రానివ్వడు. పత్రికలు, టీవీలు ఎలాగూ ఇప్పటికే అమ్ముడుపోయాయి కాబట్టి ఇక మీదట బాబు ఎలాంటి నేరాలు చేసినా కనీసం వార్తలు రాసేవారు ఉండరు. పైగా తానే చంపేసి మీ బంధువులే చంపారని మీ మీదనే దుష్ప్రచారం చేస్తాడు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు ఉద్యోగాలు ఉండవు, బతికే పరిస్థితి ఉండదు. మీ అందరికీ తెలిసిందే.. ఇటీవల బీసీలకు జడ్జిల ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వస్తే చంద్రబాబు దగ్గరుండి లేఖలు రాశాడు. బీసీలు జడ్జిలు పనికిరారు, వారికి సామర్థ్యం లేదని లేఖలు రాసిన విషయం మర్చిపోవద్దు.
చంద్రబాబు చూపిస్తున్న సినిమాలు, డ్రామాలు చూసి మీరు నమ్మితే.. ఎన్నికల ప్రకటనలు చూసి పొరపాటున నమ్మితే నరమాంసాలు తినే అందమైన రాక్షసిని నమ్మినట్లేనని గుర్తుపెట్టుకోండి. ఒకసారి నమ్మి మోసపోయాం.. మళ్లీ మోసపోయే కార్యక్రమం జరిగిదంటే ఎవ్వరం బతకమని ఎవరూ మర్చిపోవద్దు. ఈ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదానికి అర్థం రావాలి. రాజకీయ నాయకుడు మైక్ పట్టుకొని లానిది చేస్తానని చెబితే.. అది ఎన్నికల ప్రణాళికలో పెట్టి గెలిచిన తరువాత ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. అప్పుడే విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుంది. మరో 14 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.. ఈ 14 రోజుల్లో రోజుకో సినిమా చూపిస్తాడు. అవి చూసి మోసపోవద్దు.. ఇవాళ ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుందని ఎవరూ మర్చిపోవద్దు. చంద్రబాబు కుట్రలు రాబోయే రోజుల్లో తీవ్రస్థాయికి చేరుతాయి. మీ గ్రామాలకు, మీ వార్డులకు మూటల మూటల డబ్బులు పంపిస్తాడు. మీ అందరినీ ఒకటే కోరుతున్నా.. మీ అందరూ మీ గ్రామాల్లో, మీ వార్డులో ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను, ప్రతి అన్నను, ప్రతి అవ్వాతాతను కలవండి.
చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలు తీసుకొని మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్ను ముఖ్యమంత్రి చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు అన్న ప్రతి అక్క చేతిలో రూ. 15 వేలు పెడతాడని చెప్పండి. మన పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చదివించగలుగుతున్నామా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదు అక్కా.. పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నాం.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను పెద్ద చదువులు ఎన్ని లక్షలు ఖర్చు అయినా అన్న ఉచితంగా చదివిస్తాడని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి.
పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అని చెప్పండి. ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. ఒక్క రూపాయి మాఫీ చేసిన పరిస్థితి లేదు. గతంలో మనకు సున్నావడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత సున్నావడ్డీ ఎగరగొట్టాడు. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఉన్న రుణాలన్నీ మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాడని ప్రతి అక్కకు, ప్రతిచెల్లెమ్మకు చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకి రుణాలు వచ్చేది జగనన్నతోనే సాధ్యమని చెప్పండి.
పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్ఆర్ చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి.
గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. 20 రోజులు ఓపికపట్టు అన్న.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల పెట్టుబడుల కోసం రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు.. గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి.
అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్ ఎంత వచ్చేదని అడగండి.. పెన్షన్ వచ్చేది కాదని, లేకపోతే రూ. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. 20 రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి.
ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఇల్లు లేదు. కట్టిస్తానన్న మాట పోయింది. 20 రోజులు ఓపిక పట్టు అన్నా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అక్షరాల 25 లక్షల ఇళ్లులు కట్టిస్తాడని చెప్పండి. రాజన్న రాజ్యంలో ఇళ్లులు కట్టడం చూశాం. మళ్లీ జగనన్నతోనే అది సాధ్యమని ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి.
నవరత్నాల్లోని ప్రతి అంశం, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ దగ్గరకు చేర్చండి. ప్రతి అవ్వతాతకు, ప్రతి అన్నకు చెప్పండి. పేదవాడి జీవితం నవరత్నాలతో మారుతుందని గట్టిగా నమ్ముతున్నాను. మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నవరత్నాలకు కట్టుబడి ఉన్నాను. నవరత్నాలతో మీ జీవితాలను బాగుపరుస్తానని మాటి ఇస్తున్నాను. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు నా చెల్లెలు రోజమ్మకు అందించాలని పేరు పేరున కోరుతున్నాను. అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా మన పార్టీ తరుఫున నిలబడుతున్న రెడ్డన్నపై మీ ఆశీస్సులు ఉంచాలని కోరుతున్నాను. అలాగే మన పార్టీ గుర్తు ఫ్యాన్ అని ఎవరూ మర్చిపోవద్దు.