<strong>వైయస్ఆర్సీపీ నాయకుడు కన్నబాబు</strong>తూర్పు గోదావరి: ఈ రాష్ట్రంలో దమ్మున్న నాయకుడు వైయస్ జగన్ ఒక్కరే అని కన్నబాబు పేర్కొన్నారు. ప్రజల కష్టాల్లో తోడుగా ఉన్న వైయస్ జగన్తో కలిసి ప్రయాణం చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. అలుపెరగని పోరాటం చేస్తున్నారని, టక్కు టమార విద్యలు ప్రదర్శిస్తున్న చంద్రబాబుతో జగనన్న పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడు వైయస్ జగన్కు మనస్పూర్తిగా అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు.