251వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


విశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 251వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శనివారం ఉదయం అనకాపల్లి నియోజకవర్గంలోని బస చేసే ప్రాంతం నుంచి వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మామిడిపాలెం క్రాస్, గంధవరం వద్ద చౌడవరం నియోజకవర్గంలోని ప్రజా సంకల్ప యాత్ర ప్రవేశిస్తుంది. చోడవరం మండలం దొడ్డుపాలెం క్రాస్, వెంకన్నపాలెం, గోవడ, అంబడేరు పురం వరకు సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం గణపతి నగరం, చోడవరం వరకు సాగుతోంది. చోడవరం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. 
 

తాజా వీడియోలు

Back to Top