గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని మణిపాల్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఉండవల్లి నుంచి ప్రారంభమైన 135వ రోజు ప్రజా సంకల్ప యాత్ర పట్టాభిరామయ్య కాలనీ, మహానాడు, సుందరయ్యనగర్ మీదుగా పాదయాత్ర మణిపాల్ ఆస్పత్రి వరకు కొనసాగింది.