అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 38వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నదిమగడ్డ గ్రామంలో గాండ్ల, పెరిక కులస్తులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ..ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తానని, మహిళలకు డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు.