<strong>విజయనగరంః </strong> వైయస్ జగన్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్న టీడీపీ నేతలు ప్లెక్సీలను ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పోందుతున్నారు. బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం ముగడ సమీపంలో వంద ప్లెక్సీలను టీడీపీ నేతలు చించివేశారు. టీడీపీ దాష్టీకం చేస్తున్న పోలీసులు కూడా పట్టించుకోలేదని వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.