<strong>వైయస్ జగన్ మోహన్ రెడ్డి</strong>కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దివ్యాంగులను అన్ని విధాల ఆదుకుంటానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం వైయస్ జగన్ దివ్యాంగులకు ట్రై సైకిళ్లను అందజేశారు. మన ప్రభుత్వం వచ్చాక పింఛన్ పెంచి, జీవనోపాధి కోసం చర్యలు తీసుకుంటానన్నారు. ప్రతి మండల కేంద్రంలో ఓ అనాథాశ్రయం ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు.