కంప్యూటర్లున్నా స్టాఫ్ లేరన్నా...జర్జంగి పాఠశాల విద్యార్ధులు

శ్రీకాకుళం తమ పాఠశాలలో కనీస వసతులు లేవన్నా అంటూ
 టెక్కలి నియోజకవర్గ జర్జంగి పాఠశాల
విద్యార్ధులు ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డితో ఆవేదన పంచుకున్నారు.
పాదయాత్ర ద్వారా తమ ప్రాంతానికి వచ్చిన జననేతను బుధవారం ఉదయం విద్యార్ధులు కలుసుకుని
తాము ఎదుర్కుంటున్న సమస్యలను వివరించారు. తమ పాఠాశాలకు ప్రహారీ లేకపోవడంతో, పశువుల
నిలయంగా మారిందని, కంప్యూటర్లున్నా బోధించేందుకు సిబ్బంది లేరంటూ వారు గోడు
వెలిబుచ్చుకున్నారు. 

Back to Top