అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
జేసీ వర్గీయుల అరాచకాలకు అంతులేదు
05 Dec 2017 2:40 PM
తాడిపత్రి: జేసీ వర్గీయుల అరాచకాలకు అంతు లేకుండా పోయిందని ఇటీవల హత్యకు గురైన సింగిల్ విండో చైర్మన్, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయభాస్కర్రెడ్డి హత్య కేసులోని సాక్షులు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వారు వైయస్ జగన్ను కలుసుకునేందుకు వచ్చారు. సాక్షులు, బంధువుల పొలాలను జేసీబీలతో తొక్కిస్తూ, బోర్లు నాశనం చేస్తూ తీవ్ర ఇబ్బందులుకు గురిచేస్తున్నారని వాపోయారు. జేసీ వర్గీయుల వల్ల జీవనాధారం కోల్పోయామని వారు చెప్పారు. పోలీసులు, అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. నిందితులు ధైర్యంగా తిరుగుతున్నా.. వారిని పట్టించుకోకుండా సాక్షులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. విజయభాస్కర్రెడ్డి కేసు రాజీ చేసుకుంటేనే ఊర్లో తిరగనిస్తామని, లేకపోతే అంతుచూస్తామని బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం వైయస్ జగన్కు చెప్పేందుకు పాదయాత్రకు వచ్చామన్నారు.