విజయనగరం: ప్రజా సంకల్ప యాత్ర 301వ రోజు గిరిజన సంక్షేమ సేవా సంఘం నేతలు వైయస్ జగన్ను కలిశారు. గిరిజన సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. తన స్వార్థం కోసం అనుభవం లేని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను జననేతకు వివరించారు.