వైయ‌స్ జ‌గ‌న్‌కు అక్షయగోల్డ్‌ బాధితుల విన‌తి


క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని అక్ష‌య గోల్డు బాధితులు క‌లిశారు.ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న ప్ర‌తిప‌క్ష నేత‌ను అక్ష‌య గోల్డు బాధితులు త‌మ గోడు వెల్ల‌బోసుకున్నారు. వైయస్ జగన్ ఎదుట సురేష్ బాబు అనే ఏజెంట్ క‌న్నీరు పెట్టుకున్నారు..యాజమాన్యం ఆస్తులు అమ్మి బాధితుకు డబ్బులు చెల్లించాలని ..కోర్టు ఆదేశించినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. .అక్షయ్ గోల్డ్ యాజమాన్యం రూ.500 - రూ.600 కోట్లు బకాయి పడింద‌ని తెలిపారు. ఇప్పటికే 100 మంది ఏజెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారని వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ..అగ్రిగోల్డ్ , అక్షయ్ గోల్డ్ లాంటి మోసాలపై అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాన‌ని గుర్తు చేశారు. అయినా ఈ ప్రభుత్వం బాధితులకు ఎలాంటి న్యాయం చేయడం లేదని విమ‌ర్శించారు. ఏడాది పాటు ఓపిక పట్టండి..బాధితులందరికీ న్యాయం చేస్తాన‌ని వైయ‌స్ జగన్ హామీ ఇచ్చారు.  
Back to Top