రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ఆర్ కుటుంబంలోకి స్వచ్ఛందంగా తరలివస్తున్న ప్రజలు
04 Oct 2017 2:36 PM
తిరుపతి: వైయస్ఆర్ కుటుంబంలో చేరేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. తిరుపతి కూరగాయల మార్కెట్లో వైయస్ఆర్ కుటుంబం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... వైయస్ జగన్ నాయకత్వాన్ని బలపరుస్తామని ప్రజలే అంటున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత మా వ్యాపారాలన్నీ కుదేలైపోయాయని, మా జీవితాల్లో ఏ రకమైన మేలు జరగలేదని ప్రజలు చెబుతున్నారన్నారు. చంద్రబాబు పరిపాలన పట్ల ప్రజలంతా అసహనంతో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు గుణపాఠం తప్పదని టీడీపీని హెచ్చరించారు.