బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
టీడీపీకి రోజులు దగ్గర పడ్డాయి
14 Oct 2017 11:43 AM
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీకి ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు అన్నారు. మాడుగుల నియోజకవర్గ పరిధిలోని దేవరాపల్లి మండలం బోయలకిండాట, రైవాడ గ్రామాల్లో వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్యాల నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రజలకు వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వాములను చేశారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బూడి వెంకటేష్, బాబురావు, క్రరి సత్యం, రాము తదితరులు పాల్గొన్నారు.
కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో..
చోడవరం నియోజకవర్గంలో వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో ఇంటింటికీ వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని బుచ్చయపేట మండలం నీలకంఠాపురం, రాజం, సీతయ్యపేట గ్రామాల్లో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు.