మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ జగన్తో కొణతాల రామకృష్ణ భేటి
16 Mar 2019 7:08 PM
ఉత్తరాంధ్ర సమస్యలపై చర్చ
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరిన కొణతాల
హైదరాబాద్: ఉత్తరాంధ్ర చర్చ వేదిక నాయకులు, సీనియర్ నేత కొణతాల రామకృరామకృష్ణ వైయస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సమస్యలపై జననేతతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి నీళ్లు, నిధులు, నియామకాలు కల్పించాలని, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వైయస్ జగన్తో మాట్లాడామని చెప్పారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో స్వయం ప్రతిపాదిక సంస్థలు ఉండేవని, మహానేత మొదలుపెట్టిన ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరామన్నారు. పురుషోత్తంఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని కోరామన్నారు. స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించాలని, శ్రీకాకుళంలో జాతీయ విద్యా సంస్థ ఏర్పాటు చేయాలని, ఉత్తరాంధ్రలో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. విజయనగరం ఒకప్పుడు కళలకు మొదటిస్థానంలో ఉండేదన్నారు. మత్సకారులు, దళితులు, గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలని వైయస్ జగన్తో చర్చించామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని వైయస్ జగన్ హామీ ఇచ్చారన్నారు.