రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ
22 Mar 2017 12:38 PM
శ్రీకాకుళంః టీడీపీ ఆరిపోయే దీపమని వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్ విమర్శించారు. గడప గడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం కొత్తరేవు గ్రామపంచాయతీలో గల పరపతివానిపేట, కంబాలవానిపేట,అక్కువరం, కోవిరిపేట మత్స్యకారుల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ...చంద్రబాబు ప్రభుత్వం దొడ్డిదారిన స్థానికసంస్థల ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకొందని, వాపును చూసి బలుపు అనుకుంటోందని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు రావాలన్న తమ నాయకుడు సవాల్ ను ప్రభుత్వం స్వీకరించాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలెవరూ అధైర్యపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. ప్రభుత్వానికి ప్రజల్లో బలం లేకనే లోకేష్ ను దొడ్డిదారిని మండలికి పంపించిందని ఎద్దేవా చేశారు.