వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అసమర్థత పాలనకు స్వస్తి చెబుదాం
07 Apr 2017 4:47 PM
ముమ్మిడివరం: చంద్రబాబు అసమర్థత పాలనకు రానున్న ఎన్నికల్లో స్వస్తి చెప్పి.. వైయస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ముమ్మిడివరం నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ అన్నారు. కాట్రేనికోన మండలంలో కాట్రేనికోన పంచాయతీ పరిధిలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబు నీచ పరిపాలనను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో అబద్ధపు హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసగించారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తమ ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు.