రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
సీఎం చొరవతో 5.94 లక్షల మంది రైతులకు మేలు
26 Jun 2020 12:50 PM
2018 రబీ పంట బీమా సొమ్ము రూ.596 కోట్లు విడుదల చేసిన సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: ‘రైతు సంక్షేమ కోసం నాన్న గారు ఒక అడుగు ముందుకేస్తే.. నేను రెండు అడుగులు ముందుకేస్తా’నని చెప్పిన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి.. ఆచరణలో చూపిస్తున్నారు. రైతు క్షేమమే.. రాష్ట్ర సంక్షేమమని నమ్మిన సీఎం వైయస్ జగన్ అన్నదాతలను ఆదుకునేందుకు ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారు. గత టీడీపీ ప్రభుత్వం 2018 రబీకి సంబంధించి రైతులకు చెల్లించిన బీమా సొమ్మును చెల్లించకుండా ఎగనామం పెట్టింది. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రైతు బీమా సొమ్ము రూ.596 కోట్లను సీఎం వైయస్ జగన్ నేడు విడుదల చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడిన అనంతరం లాప్టాప్ బటన్ నొక్కి 2018–19కి సంబంధించి రబీ పంట బీమా సొమ్ము రూ.596 కోట్లను విడుదల చేశారు. దీని ద్వారా 5.94 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది.