ఫిబ్రవరి 2న శ్రీకాకుళంలో యువభేరి

శ్రీ‌కాకుళం:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి సంజీవని అయిన  ప్ర‌త్యేక హోదా కోసం నిరంత‌రం శ్ర‌మిస్తున్న ఏకైక నాయ‌కుడు ఒక్క వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాత్ర‌మేన‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, పార్టీ జిల్లా అధ్య‌క్షురాలు రెడ్డి శాంతి అన్నారు.  అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని చెప్పిన బాబు మోసాన్ని నిల‌దీసేందుకు ....ఫిబ్ర‌వ‌రి 2న శ్రీకాకుళం జిల్లాలో యువ‌భేరి నిర్వ‌హించనున్నట్లు పేర్కొన్నారు. 

 ఫిబ్ర‌వ‌రి 2వ తేదీన ఉద‌యం 10 గంట‌ల‌కు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హైద‌రాబాద్ నుంచి శ్రీ‌కాకుళం ప‌ట్టణానికి చేరుకొని టౌన్‌హాల్‌లో నిరుద్యోగులు, యువ‌త‌తో ప్ర‌త్య‌క్షంగా మాట్లాడతార‌ని వారు ఈ సంద‌ర్భంగా చెప్పారు. రాష్ట్ర విభ‌జ‌న వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జ‌రుగుతున్న అన్యాయం, కేంద్రం ఇచ్చిన హామీల‌ను నేర‌వేర్చ‌క‌పోవ‌డాన్ని ప్ర‌సావిస్తార‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో యువ‌త బంగారు భ‌విష్య‌త్తు కోసం చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌ను వైఎస్ జ‌గ‌న్ వివ‌రిస్తార‌ని తెలిపారు.  అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు హాజ‌రై ఈ కార్య‌క్రమాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు.
Back to Top