వైయస్ అవినాష్రెడ్డివిజయవాడ: రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వైయస్ జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని వైయస్ అవినాష్రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా విషయంలో వైయస్ జగన్ ప్రకటించిన కార్యాచరణ ప్రకారం పార్లమెంట్లో పోరాటం చేశామన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా తమ పదవులకు రాజీనామా చేసి ఆమరణదీక్ష చేశామన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైయస్ జగన్ నిర్ణయించే ఎటువంటి పోరాటమైన చేస్తామని స్పష్టం చేశారు.