<br/>విశాఖ: దాచేపల్లి సంఘటనపై సీఎం వ్యాఖ్యలు సిగ్గుచేటు అని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తొమ్మిదేళ్ల ఆడపిల్లపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సుబ్బయ్య టీడీపీ క్రియశీల కార్యకర్త అని, ఆయనకు లోకేష్ టీం సభ్యత్వం ఇచ్చిందన్నారు. చంద్రబాబు తన వైఫల్యాలను విపక్షంపై నెట్టడం దారుణమన్నారు. ఎమ్మెల్యే యరపతినేని, నన్నపనేని రాజకుమారి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.