మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ప్రజాస్వామ్య దేశం కాబట్టి చంద్రబాబు బతికిపోయాడు
20 Oct 2018 12:01 PM
వైయస్ఆర్ జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారని చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. మన దేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి చంద్రబాబు బతికిపోయాడని అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారని, రైతు రుణమాఫీ అని మాయమాటలు చెప్పి రైతులను మోసగించారని విమర్శించారు. రూ.5 వేల కోట్లతో రైతులకు మద్ధతు ధరలు కల్పిస్తామని మరిచిపోయారని ధ్వజమెత్తారు. పంటలకు మద్ధతుల ధరలు కల్పించకపోతే భవిష్యత్లో వైయస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.