ఏపీ అసెంబ్లీ: ధరల స్థీరీకరణ లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. ఇన్పుట్ సబ్సిడీ వెంటనే చెల్లించాల్సిన పరిహారం. ఎందుకు ఈ పంటలు నష్టపోతున్నాయన్న విషయాలు గమనించాలి. ధరల స్థీరీకరణ గురించి ఆలోచించాలి. పంటలు పుష్కలంగా పండినా మద్దతు ధర లేక హర్టికల్చర్ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇన్యూరెన్స్ కూడా బుడ్డ శనగ పంటకు 2012కు సంబంధించి 28 వేల మంది రైతులకు ఇన్సూరెన్స్ బకాయిలు ఉన్నాయి.<br/>