సిట్‌పై నమ్మకం లేదు...

కుట్రలో శివాజీ కూడా భాగస్వామి..
వైయస్‌ఆర్‌సీపీ నేత తమ్మినేని సీతారాం
శ్రీకాకుళంః వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై రాష్ట్రపోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయలేకపోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటు జిల్లా అ«ధ్యక్షులు తమ్మినేని సీతారాం అన్నారు. కుట్రలో శివాజీ కూడా భాగస్వామి అని, అతనిని ఎందుకు విచారించడంలేదని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టులో సీసీ పుటేజీని ఎందుకు బయటపెట్టడంలేదన్నారు. గతంలో మల్లెల బాబ్జీకి పట్టిన గతే ఇప్పుడు శ్రీనివాస్‌కు పడుతుందనే అనుమానాలున్నాయన్నారు.సిట్‌పై నమ్మకం లేదని న్యాయవిచారణ జరిపించాలన్నారు. థర్డ్‌ పార్టీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని  ప్రశ్నించారు.

Back to Top