విజయవాడ: ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటున్న జనసేన పార్టీ ఏం చేస్తోందని వైయస్ఆర్సీపీ నాయకుడు పేర్నీ నాని ప్రశ్నించారు. తుందు్రరు బాధితుల సమస్య, రాజధాని రైతుల సమస్యలు, ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం చేస్తామన్నారని, ఇంతవరకు ఏం సాధించారని నిలదీశారు. ఏ సమస్యపైనా పవన్ చివరిదాకా పోరాడలేదని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు, రాజకీయాలకు తేడా తెలుసుకోవాలని సూచించారు. <br/>