<strong>వైయస్ఆర్ సీపీ పి.గన్నవరం సమన్వయకర్త కొండేటి చిట్టిబాబు</strong>తూర్పుగోదావరి: చంద్రబాబు పాలనలో అవినీతి కట్టలు తెంచుకుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పి.గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త కొండేటి చిట్టిబాబు ధ్వజమెత్తారు. పేదవారికి ఇళ్లు మంజూరుకు జన్మభూమి కమిటీలు లంచాలు అడుగుతున్నారని మండిపడ్డారు. టీడీపీ అరాచకాన్ని నిరసిస్తూ పి.గన్నవరం హౌసింగ్ కార్యాలయాన్ని వైయస్ఆర్ సీపీ నేతలు ముట్టడించారు. ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు మంజూరు చేయాలని, అక్రమ వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేశారు.