కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
అభిమానులైతే దండాలు పెడతారు..హత్య చేస్తారా
25 Oct 2018 5:29 PM
అమరావతి: అభిమానులైతే కాళ్లకు దండాలు పెడతారు లేదంటే దండలు వేసి అభిమానం చాటుకుంటారు..అలా గాకుండా అభిమానులు హత్యాయత్నం చేస్తారా అని వైయస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ టీడీపీ నాయకులనుద్దేశించి ప్రశ్నించారు. హత్యాయత్నం చేసిన వ్యక్తి, వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభిమాని అని టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
నిజా నిజాలు బయట పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగితే సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమే అవుతుందని వ్యాఖ్యానించారు.