<br/>వైయస్ఆర్ జిల్లా : వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో వైయస్ఆర్ స్వర్ణయుగం మళ్లీ చూడవచ్చని వైయస్ఆర్ జిల్లావాసులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కువైట్లో ఉంటున్న వైయస్ఆర్ జిల్లా వాసులు కువైట్ వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు ముమ్మడి బాలిరెడ్డి, గల్ఫ్ అధ్యక్షుడు ఇలియాస్, కువైట్ ఎస్సీ, ఎస్టీ అధ్యక్షుడు బీఎన్ సింహా సమక్షంలో కువైట్లో వైయస్ఆర్సీపీలో చేరారు. పార్టీలో చేరిన భువనగిరి సుబ్బయ్య, రేవూరు రాజగోపాల్, రేవూరు రామచంద్రయ్య, తాళ్లపాక శేఖర్, పోలూరు ప్రభాకర్, జోరోపల్లె శివయ్య తదితరులతోపాటు వైయస్ఆర్ జిల్లా పెనగలూరు మండలంలోని తిరుమలరాజుపేటకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి మాట్లాడుతూ జననేత వైయస్ జగన్మోహనరెడ్డి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 2019 ఎన్నికల్లో వైయస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. ప్రస్తుత పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని చెప్పారు. వైయస్ఆర్సీపీలో చేరిన సభ్యులు మాట్లాడుతూ.. వైయస్ జగన్ నిరంతరం ప్రజల కోసం పడుతున్న తపన తమను ఆకర్షించిందన్నారు. పార్టీలోకి చేరేందుకు అవకాశం కల్పించిన బాలిరెడ్డి, నరసారెడ్డి, మహేశ్వరరెడ్డి, గోవిందు నాగరాజు, బీఎన్ సింహాలకు కృతజ్ఞతలను తెలిపారు.<br/><br/>