సమైక్యాంధ్రలోనే ఎన్నికలను ఎదుర్కొంటాం

న్యూఢిల్లీ :

సమైక్యాంధ్ర ప్రదేశ్‌లోనే వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొంటామని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధీమాగా చెప్పారు. ఆ ఎన్నికల అనంతరం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని రాజమోహన్‌రెడ్డి చెప్పారు. తమ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను గెలుచుకొని జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శుక్రవారం నిర్వహించిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ధర్నాలో పాల్గొన్న అనంతరం మీడియా ప్రశ్నలకు‌ మేకపాటి పై విధంగా బదులిచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీతో శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి కుమ్మక్కయినట్టు చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని మేకపాటి దుయ్యబట్టారు. ఒకవేళ కుమ్మక్కై ఉంటే శ్రీ జగన్ 16 నెలల‌ పాటు జైలులో ఎందుకు ఉండాల్సి వస్తుంని ప్రశ్నించారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదకి కచ్చితంగా చెప్పారు. సమస్య పరిష్కరించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌ పార్టీకి లేదని మేకపాటి విమర్శించారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించినప్పుడు అది ఆయన భావన అని, దానికి మనమేం చేయలేమన్నారు.

‘రానున్న ఎన్నికల్లో 100 సీట్లు వచ్చే పార్టీ లేదు. కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాదు. ఫలితాలు అంతా అయోమయంగా ఉంటాయి. ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి లౌకిక శక్తులతో కలిసి ముందుకువెళతాం’ అన్నారు.‌ యుపిఎతో పొత్తు విషయమై మీడియా ప్రశ్నకు ఆయన పై విధంగా బదులిచ్చారు. శ్రీ జగన్‌ను నష్టపర్చడానికి కాంగ్రెస్ ఎత్తుగడలో భాగంగానే దిగ్విజ‌య్‌సింగ్ జగన్‌, కాంగ్రె‌స్ ‌డిఎన్‌ఎ ఒక్కటేనని వ్యాఖ్యానించారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ఓట్లు వేయడం కోసమే అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top