<p style="text-align:justify"><p style="text-align:justify">హైదరాబాద్: తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకొని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ భోగి పండుగ అందరికీ భోగ భాగ్యాలను ప్రసాదించాలని, సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాలలోనూ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరి ముంగిళ్లలో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.</p><p style="text-align:justify">రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లతో, రక రకాల వేడుకలతో కూడిన సంక్రాంతి అంటేనే రైతులు, పల్లెల పండుగ అని అన్నారు. పాడి పంటలతో, పైరు పచ్చలతో ప్రతీ పల్లె కళకళలాడినప్పుడే ప్రజలు ఆనందంగా ఉంటారని, అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేలలో రైతన్నలు, గ్రామీణ వృత్తులవారంతా భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో తులతూగాలని కోరుకొంటున్నట్లుగా వైఎస్ జగన్ మకర సంక్రాంతి శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. </p></p>