డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు

హైదరాబాద్‌ : అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌  శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. క్షిపణి ప్రయోగం సక్సెస్‌పై ఆయన ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలతో పాటు మిలిటరీ కృషిని వైయస్‌ జగన్‌ ప్రశంసించారు. కాగా స్వదేశీ పరిజ్ఞానంతో డిఫెన్స్ రిసెర్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) రూపొందించిన అగ్ని-5 ఖండాంతర క్షిపణి ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే.


Back to Top