ఐదేళ్ల ప్రయాణం అద్భుతం ఆ ద్రోహం మీ బాబుదే రామోజీబాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి
పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..!
27 Oct 2015 4:43 PM
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పామాయిల్ రైతులకు మద్దతుగా నిలిచేందుకు మరోసారి నవంబర్ మొదటి వారంలో జగన్ జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక పాలనకు సంబంధించి....పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై వైఎస్ జగన్ కూలంకషంగా చర్చించారు.
గిట్టుబాటు ధర లేక పామాయిల్ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేతలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. అందుకు సానుకూలంగా స్పందించిన జననేత తప్పకుండా జిల్లా పర్యటనకు వస్తానని వారికి హామీ ఇచ్చారు. పామాయిల్ రైతుల్లో ధైర్యం నింపడంతో పాటు.. గిట్టుబాటు ధర కల్పించేలా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. గతంలోనూ వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించి పామాయిల్ రైతులకు బాసటగా నిలిచారు.