<strong>నెల్లూరు జిల్లాలో విషాదం</strong><strong>బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు</strong><strong>మృతుల కుటుంబాలకు వైయస్ జగన్ సంతాపం</strong><strong>క్షతగాత్రులను పరామర్శించిన వైయస్సార్సీపీ నేతలు</strong><br/><strong>నెల్లూరు</strong>: నెల్లూరు జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు నగర శివార్లలోని పొర్లుకట్ట సమీపంలో ఉన్న ఓ ఇంట్లో బాణసంచా పదార్థాల వల్ల పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు మృతిచెందారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులను ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే కోటంరెడ్డి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి, డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్ తదితరులు పరామర్శించారు.<br/>గాయపడ్డ వారిలో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఓ ఇంట్లో వంట చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగిరిపడి.. బాణాసంచాకు అంటుకోవడంతో వరుసగా 10 ఇళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఉదయం 9.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.<br/>