యువభేరి ప్రాంగణంలో వైఎస్ జగన్

జనం కోసం జననేత పోరాటం
హోదా కోసం అలుపెరగని పోరు
కాకినాడలో యువభేరి కార్యక్రమం
విద్యార్థులతో వైఎస్ జగన్ ముఖాముఖి

తూర్పుగోదావరిః కాకినాడలోని అంబేద్కర్ భవన్ లో  యువభేరి కార్యక్రమం ప్రారంభమయింది. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ యువభేరి ప్రాంగణానికి చేరుకున్నారు. జననేతకు విద్యార్థిలోకం ఘన స్వాగతం పలికింది. వైఎస్ జగన్...సభా వేదికపై ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి, సరస్వతి దేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి  పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు, యువత ఇతర నాయకులతో అంబేద్కర్ భవన్ కిక్కిరిసిపోయింది. రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరగనున్న ఈ యువభేరి కార్యక్రమానికి  వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన ప్రత్యేక హోదా, దాని వల్ల వచ్చే ప్రయోజనాలపై నిరుద్యోగులు, విద్యార్థులకు సభలో  వైఎస్ జగన్ వివరించనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు  ప్రత్యేకహోదాను  విస్మరిస్తున్న... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని వైఎస్ జగన్ ఎండగట్టనున్నారు. అదేసమయంలో  రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఆవశ్యకత గురించి  విద్యార్థులు, యువతకు జననేత దిశానిర్దేశం చేస్తారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని తన నివాసం నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్ కు .... పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎయిర్ పోర్ట్ లో  ఘన స్వాగతం పలికారు. అనంతరం జననేత అక్కడ నుంచి రోడ్డు మార్గాన కాకినాడకు పయనమయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేకహోదా కోసం వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు. రాష్ట్రానికి హోదా ఇస్తామన్న బీజేపీ, తెస్తామన్న టీడీపీ..రెండు పార్టీలు మోసం చేశాయి.  ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడడం కోసం చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టాడు. విభజన చట్టంలోని హామీలు తీసుకురావడంలోనూ, హోదాను సాధించడంలోనూ టీడీపీ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఈనేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఆబాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్నారు. 

రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం వైఎస్ జగన్ అలుపెరగకుండా ఉద్యమిస్తున్నారు. . రాష్ట్రంలోనూ, ఢిల్లీలో ధర్నాలు చేశారు. రాష్ట్ర బంద్ నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో  రిలేదీక్షలు చేపట్టారు. అసెంబ్లీలో టీడీపీ సర్కార్ మెడలు వంచి హోదా తీర్మానం చేయించారు. గుంటూరు వేదికగా ప్రాణాలను పణంగా పెట్టి వైఎస్ జగన్  నిరవధిక నిరాహార దీక్ష చేశారు. వైఎస్ జగన్ కు అండగా రాష్ట్ర ప్రజానీకమంతా కదం తొక్కింది.  చంద్రబాబు... హోదాకు, జననేత పోరాటాలకు అడ్డుపడుతూ చేయని కుట్రలు లేవు. ఐనా మొక్కవోని దీక్షతో వైఎస్ జగన్ ప్రత్యేకహోదా కోసం నిర్విరామంగా తన పోరాటం కొనసాగిస్తున్నారు. రాష్ట్రానికి హోదా సాధించేవరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. విద్యార్థి సంఘాలు నిర్వహించిన యువభేరి సదస్సుల్లోనూ వైఎస్ జగన్ చీఫ్ గెస్ట్ గా పాల్గొని  హోదా ప్రాముఖ్యతను చాటిచెప్పుతూ  ప్రతి ఒక్కరినీ మేలుకొల్పుతున్నారు.
Back to Top